Khanapur | ప్రజలే ప్రచారం..
Khanapur, మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం ఖానాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సంగెం అరుణ గట్టయ్య ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అరుణ గట్టయ్య గెలుపు ఖాయమని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. గ్రామస్తులంతా స్వయంగా ఆమె కోసం వాడవాడల ప్రచారం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీవీ రిమోట్ గుర్తు పై ఓటేసి గెలిపించాలని, గెలిచిన తర్వాత గ్రామంలో కోతుల బాధ నుండి విముక్తి కల్పిస్తానని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో నిరుపేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని.. నిరుపేద ప్రజల కోసం ఎల్లవేళలా అండగా ఉంటానని ఆమె పేర్కొన్నారు.
గ్రామంలో యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తానని ఆమె తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం కల్పించాలని.. మంథని మండలంలోని ఖానాపూర్ గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆమె తెలిపారు. గ్రామంలో రోడ్ల మరమ్మత్తులు, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేస్తానని వివరించారు. ప్రజలు మెచ్చేలా, ప్రజలు విశ్వసించేలా పాలకురాలుగా కాకుండా సేవకురాలిగా పని చేస్తానని ఆమె చెప్పారు.

