Key Meeting | త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో రాజ్ నాథ్ భేటి… దాడి ప‌రిస్థితుల‌పై స‌మీక్ష

న్యూ ఢిల్లీ – ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు ఉద‌యం త్రివిధ ద‌ళాధిప‌తులు, సీడీఎస్‌తో స‌మావేశ‌మ‌య్యారు. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో దాయాది పాక్ దాడుల‌ను భార‌త బ‌ల‌గాలు తిప్పికొట్టిన నేప‌థ్యంలో న్యూఢిల్లీ ఈ ఉద‌యం ఈ కీల‌క భేటీ నిర్వ‌హించారు. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌పై పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైల్ దాడుల‌ను భార‌త సైన్యం తిప్పికొట్టిన కొన్ని గంట‌ల్లోనే ఈ స‌మావేశం జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ భేటిలో పాక్ చేసిన దాడి వివ‌రాల‌తో పాటు తాము చేసిన ఎదురు దాడి వివ‌రాల‌ను ర‌క్ష‌ణ మంత్రికి ద‌ళాధిప‌తులు వివ‌రించారు.. పాక్ దాడుల‌లో ఎటువంటి న‌ష్టం వాటిల్ల లేద‌ని కూడా వెల్ల‌డించారు..

Leave a Reply