Kamareddy | ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్

కామారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) – కామారెడ్డి జిల్లాలో ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. సంజీవ్​ కామారెడ్డి పట్టణ పోలీస్​ స్టేషన్​ నుంచి కోర్టులో సీడీవోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కేసులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్​ చేసినట్లు సమాచారం. తీరా.. లంచం ఇవ్వలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అయితే లంచం డబ్బులు డిమాండ్​ చేసిన వ్యవహారంలో కానిస్టేబుల్​తో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈక్రమంలో పలువురు పోలీసు అధికారులను పిలిపించి వివరాలు ఆరాతీస్తున్నట్లు సమాచారం.

Leave a Reply