హైదరాబాద్: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ గురువారం విడుదల చేయనుంది. బీటెక్, బీఈ ప్రవేశాలకు పరీక్ష ఫైనల్ కీని కూడా అందుబాటులో ఉంచనుంది. అధికారిక వెబ్సైట్ Jeemain.nta.nic.inలో పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్చేసుకోవచ్చు. దీనికోసం విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బీటెక్ ప్రవేశాల కోసం ఈ నెల 2, 3, 4, 7, 8 తేదీల్లో, బీఆర్క్, బీప్లాన్ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఏప్రిల్ 9న పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
కాగా, మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా.. రెండో సెషన్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. వీటి ఆధారంగా పరీక్షల్లోని ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించనుంది. కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్ను నిర్ణయించి సెషన్ 1, 2లో అర్హత సాధించిన మొత్తం 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించినట్లు ప్రకటించనుంది. వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 18న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తారు.
జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు
ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 5
హాల్టికెట్లు: మే 11
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష: మే 18
రెస్పాన్స్ షీట్లు విడుదల: మే 22
ప్రాథమిక కీ విడుదల: మే 26 .
ఫైనల్ కీ, ఫలితాలు విడుదల: జూన్ 2న ఉదయం 10 గంటలకు