IPL 2025 | సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితి.. ఆ మ్యాచ్ వేదిక మారింది !

భారత్-పాక్ యుద్ధ సెగ‌లు ఐపీఎల్ 2025పై ప్రభావం చూపిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో… సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారత సరిహద్దు ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో సరిహద్దు సమీపంలోని ధర్మశాల నుంచి క్రికెట్ మ్యాచ్‌లను తరలించారు.

ఈ క్ర‌మంలో ధర్మశాలలో జరగాల్సిన ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వేదికను మార్చారు. మే 11న జరగాల్సిన ఈ మ్యాచ్ ధర్మశాలలో కాకుండా అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Leave a Reply