రాజస్థాన్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో భారత భద్రతా దళం ఒక పాకిస్తానీ రేంజర్ను అదుపులోకి తీసుకుంది.
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థులు నెలకొన్నాయి. ఇటీవల, ఏప్రిల్ 23న, పంజాబ్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ను పాకిస్తాన్ సైన్యం నిర్బంధించింది.
అయితే, పూర్ణమ్ కుమార్ను అప్పగించాలని డిమాండ్ చేసినప్పటికీ.. పాకిస్తాన్ అతన్ని అప్పగించలేదు. దీనికి ప్రతీకారంగా, భారత భద్రతా దళాలు రాజస్థాన్లోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలో ఒక పాకిస్తాన్ రేంజర్ను అరెస్టు చేశాయి.