ఇంగ్లాండ్ తో జరుగుతన్న తొలి టెస్ట్ లో భారత్ కు మంచి ఆరంభించింది. తొలి సెషన్ లో ఓపెనర్లు మంచి ప్రదర్శన ఇచ్చారు.. అయితే, తొలి సెషన్ ముగిసే సమయానికి రెండు కీలకమైన వికెట్లు కోల్పోవడం కొన్ని ఎదురుదెబ్బలకు దారితీసింది. ఫలితంగా, మొదటి రోజు లంచ్ సమయానికి భారత్ స్కోరు 2 వికెట్లకు 92 పరుగులు.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. యువ బ్యాట్స్మన్ బి. సాయి సుదర్శన్ భారత జట్టు తరపున టెస్ట్ అరంగేట్రం చేయగా, కెఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించాడు.
ఆరంభ ఓవర్లలో బంతి రెండు వైపులా స్వింగ్ అవుతూ బ్యాటర్లను పరీక్షించింది. అయితే, భారత ఓపెనర్లు తమదైన శైలిలో బౌండరీలు బాదారు. తన సహజ శైలిలో ఆకట్టుకున్న రాహుల్… కెఎల్ రాహుల్ (42 పరుగులు – 78 బంతుల్లో, 8 ఫోర్లు), బ్రైడన్ కార్స్ బౌలింగ్లో స్లిప్స్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దీంతో భారత తొలి వికెట్ 80 పరుగుల వద్ద పడింది. ఆ వెంటనే, అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ (0) డకౌట్ అయ్యాడు. లెగ్ స్టంప్ వైపు వెళ్తున్న బంతిని ఆడటానికి ప్రయత్నించి కీపర్ జేమీ స్మిత్ క్యాచ్ ఇచ్చాడు.
తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, భారత్ మొత్తం మీద ధైర్యంగా నిలబడింది. ప్రస్తుతం జైస్వాల్ (42) క్రీజులో ఉన్నాడు
లైవ్ స్కోరు (లంచ్ సమయం వరకూ):
భారత్ – 92/2 (25.4 ఓవర్లు)
రాహుల్ – 42 (78), జైస్వాల్ – (42) నాటౌట్, సుధర్షన్ – (0)