- మైదానాన్ని విడిచిన ఆటగాళ్లు
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజు ఉత్కంఠభరితంగా మారింది. ఛేదనలో దిగిన ఇంగ్లాండ్ ధీటుగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ను తమ పక్షంగా మలచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు వికెట్ కోల్పోకుడా ఇంగ్లాండ్ జట్టు 180కి పైగా పరుగులు బాదింది. మరోవైపు భారత బౌలర్లు వికెట్ల కోసం శతవిధాల శ్రమిస్తున్నా ఫలితం దక్కడంలేదు.
అయితే ఇదే సమయంలో వాతావరణం రంగంలోకి దిగింది. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2:34కి (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:04కి) మైదానంలో వర్షం చినుకులుగా మొదలై మోస్తరు నుంచి భారీగా మారింది. వర్షం తీవ్రత పెరగడంతో అంపైర్లు వెంటనే ఆటను నిలిపివేశారు. బ్యాటర్లు వేగంగా ప్యావిలియన్కి పరుగులు తీసుకెళ్లగా, భారత బౌలర్లు నెమ్మదిగా డ్రెస్రూమ్ వైపు వెళ్లారు.
ఈ వర్షం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్షం తీవ్రంగా కొనసాగుతుండటంతో, మళ్లీ ఆట ఎప్పుడు పునఃప్రారంభమవుతుందో స్పష్టత లేదు. ఇక ముందు వాతావరణ పరిస్థితులు కీలక పాత్ర పోషించనున్నాయి.
కాగా, ప్రస్తుతం క్రీజులో జాక్ క్రాలీ (59)* – బెన్ డకెట్ (105) ఉన్నారు.