హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్కం ట్యాక్స్ అధికారిణి జయలక్ష్మి శనివారం బలవన్మరణానికి పాల్పడింది. మధ్యాహ్నం సీజీవో టవర్స్ పైనుంచి దూకేసింది. దీంతో తీవ్ర గాయాలతో పడివున్న ఆమెను స్థానికులు గుర్తించి హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్య కారణాల వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Hyderabad | ఇన్కంట్యాక్స్ అధికారిణి ఆత్మహత్య
