భారత ప్రధాని గా పి వి నరసింహారావు తన సహచర ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తో కలసి అమలు చేసిన ఆర్ధిక సంస్కరణలు తదుపరి కాలం లో దేశ అభివృద్ధికి మార్గం వేశాయి అని పూర్వ న్యాయమూర్తి జస్టిస్ కాశీ విశ్వేశ్వర రావు అన్నారు. శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సంగీత నాట్య వేదిక పై గాన సభ నిర్వహణలో జరుగుతున్న ఎందరో మహానుభావులు కార్యక్రమ పరంపరలో భాగంగా పూర్వ ప్రధాని పి వి నరసింహా రావు యాది లో పేరిట సంస్మరణ సమావేశం జరిగింది.
ముఖ్య అతిథిగా జస్టిస్ కాశీ విశ్వేశ్వర రావు పాల్గొని.. మాట్లాడుతూ… బహు భాషా కోవిదుడు ఇన పి వి రాజకీయ తాత్విక వేత్త అన్నారు. మెజారిటీ లేకున్నా అందరినీ కలుపుకు పోతూ… ఐదేళ్లు పూర్తి కాలం ప్రధానిగా కొనసాగిన పి వి వివాద రహితుడు నిరాడంబరుడు అని వివరించారు. గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి అధ్యక్షత వహించిన వేదిక పై సంఘ సేవకుడు పి ఎస్ ఆర్ మూర్తి, గాయని రమా దేవి, లతా వర్మ పాల్గొన్నారు.