HYD | ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు..

హైదరాబాద్ : స్వల్ప ప్రమాదానికి గురై ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డిని (బుధవారం) తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి, పల్లా ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన పల్లాకు ధైర్యం చెప్పారు. పల్లా ఆరోగ్యంగా తిరిగి ప్రజల్లోకి రావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply