హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కార్యాలయం పై జీఎస్టీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆయన మాదాపూర్లో ఉన్న కార్యాలయంతో పాటు, కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. పెద్ద మొత్తంలో సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అనుమానాల నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ సోదాలు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ సినిమా “కన్నప్ప” విడుదలకు ముందు జరగడం గమనార్హం. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉండగా, అప్పుడే అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.
జీఎస్టీ అధికారులు సినిమా బడ్జెట్, ఖర్చులు, బ్యాంక్ లావాదేవీలు, పన్నుల చెల్లింపులపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేకించి సినిమా నిర్మాణానికి తీసుకున్న నిధుల వనరులు, వాటి వినియోగంపై విచారణ కొనసాగుతోంది.