HYD | గోల్కొండలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు… ఐదుగురు అరెస్ట్ !

గోల్కొండ ప్రాంతంలో శుక్రవారం (జూన్ 13) డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ దాడిలో ఇద్దరు నైజీరియన్లు, ముగ్గురు భారతీయులు అరెస్టు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న బాగా స్థిరపడిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాతో వారికి సంబంధాలు ఉన్నట్లు తేలింది.

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట ప్రాంతంలోని వినాయక్‌నగర్‌లోని ఒక నివాసంలో జరిగిన ఈ దాడిలో, నైజీరియాకు చెందిన‌ ఆండీ (38), రోలాండ్ (44), తెలంగాణకు చెందిన‌ వీరపల్లి లక్ష్మీపతి (29), గోవాకు చెందిన‌ రోమి భరత్ కళ్యాణి (40), క‌ర్ణాట‌కకు చెందిన‌ అబ్దుల్ జాఫర్ ఖాన్ అలియాస్ షారుఖ్ (26)ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

వీరి నుంచి 20 గ్రాముల కొకైన్‌, 45 గ్రాముల ఎమ్‌డీఎంఎ, 20 గ్రాముల ఎక్స్టసీ గోళ్లు, రూ. 40,000 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల అంచనా ప్రకారం, ఈ ముఠా హైదరాబాద్‌లో కనీసం 25 మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *