Hot Comments | ట్రంప్ కామెడీ పీస్ … పాకిస్థాన్ ఓ కుక్క – పెంట‌గాన్ మాజీ అధికారి హాట్ కామెంట్స్

కాలిఫోర్నియా – ట్రంప్‌ ఓ కామెడీ పీస్ అని, భారతీయులు అతడ్ని పట్టించుకోవాల్సిన పని లేదని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు అమెరికా పెంటగాన్ కు చెందిన మాజీ అధికారి మైఖేల్ రూబిన్ . డొనాల్డ్ ట్రంప్‌ను పిచ్చివాడిగా.. పాకిస్తాన్‌ను కుక్కగా అభివర్ణించారు ఆయ‌న‌. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ పాకిస్తాన్ ఇండియా దెబ్బకు తోకుముడిచిన కుక్కలా అయింద‌న్నారు. కాల్పుల విరమణ కోసం పరుగులు తీసింద‌ని పేర్కొన్నారు..

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ఆపింది తానేనని ట్రంప్ ప్రచారం చేసుకుంటార‌ని అన్నారు. భారత్, పాకిస్తాన్‌లు కలిసి భోజనం కూడా చేయాలని ట్రంప్ అన్నార‌ని గుర్తు చేశారు. ప్రతీ దానికి తానే కారణమని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటూ ఉంటార‌ని విమ‌ర్శించారు..

మీరు గనుక ట్రంప్‌ను అడిగితే.. ఒంటి చేత్తో వరల్డ్ కప్ సాధించానంటార‌ని రూబిన్ వ్యాఖ్య‌నించారు . ఇంటర్‌నెట్‌ను కనిపెట్టింది తానేన‌ని, . క్యాన్సర్‌ను నయం చేసింది కూడా తానే అని ప్ర‌చారం చేసుకోవ‌డంలో ట్రంప్ దిట్ట అని పేర్కొన్నారు… ఈ విషయంలో భారతీయులది కూడా అమెరికన్ల పరిస్థితే. భారతీయులు ట్రంప్‌ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.

పాకిస్థాన్ ఒక కుక్క…
పాకిస్తాన్ మీద కూడా ఆయన విమర్శనాత్మక కామెంట్లు చేశారు. పాకిస్తాన్‌ను కుక్కతో పోల్చారు. ఇండియా దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచిన కుక్కలా పారిపోయిందని అన్నారు. యుద్ధంలో పాకిస్తాన్ దారుణంగా దెబ్బతింద‌ని అన్నారు మైకెల్ . ఇండియా డిప్లమేటిక్‌గా మిలటరీ పరంగా విజయం సాధించింద‌ని ప్ర‌శంసించారు.. ఇండియా ఎందుకు విజయం సాధించిందని అంటున్నానంటే.. ఇప్పుడు అందరి చూపు. పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న విషయం వైపే ఉంది. టెర్రరిస్టులు చనిపోయినపుడు ఆర్మీ అధికారులు యూనిఫామ్‌లో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంటే దానర్థం.. అక్కడి టెర్రరిస్టులకు.. ఆర్మీ వాళ్లకు తేడా లేదని. చరిత్ర గురించి బాగా తెలిసిన వాడిగా చెబుతున్నాన‌ని పేర్కొన్నారు.. ఇండియాతో యుద్ధం చేసి ఓడిపోయిన ప్రతీ సారి తామే గెలిచామని పాకిస్తాన్ జబ్బలు చరుచుకుంటోంద‌ని అంటూ పాకిస్తాన్ తన సొంత ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

Leave a Reply