జూబ్లీహిల్స్, (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోం ఓటింగ్ మొదటి రోజు మంగళవారం విజయవంతంగా పూర్తయింది. మొత్తం 103 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకోగా, వారిలో 97 మంది తమ ఓటు హక్కును ఇంటి వద్దనే వినియోగించుకున్నారు. ఈ హోం ఓటింగ్ ప్రక్రియ గురువారం వరకు కొనసాగనుంది.
విజయవంతంగా హోం ఓటింగ్…

