దిలావర్ పూర్ ఆంధ్రప్రభ న్యూస్ ; మండల కేంద్రంలో గుర్తు తెలియని వాహనం (vehicle ) ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం చికెన్ సెంటర్ నుండి సానిష్, అబ్రార్ పాత బస్టాండ్ ( Old busstand) సమీపంలోని ధాబాకు చికెన్ తీసుకువెళ్లి తిరుగు ప్రయాణంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి (Hit & Run ) ఇద్దరు యువకులు అక్కడికి అక్కడే మృతి చెందారు.
ఘటన స్థలానికి ఏఎస్పి రాజేష్ మీనా ( ASP Rajesh Meena) చేరుకొని పంచనామా నిర్వహించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.