Gudivada | మహాత్మా.. నిన్ను మ‌రువ‌లేం

Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ మండప ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, ధర్మకర్తల కమిటీ సభ్యులు, లోయ వాసు, పంచుమర్తి శ్రీనివాసరావు, రమణమూర్తి, పోతురాజు, వీరమాచినేని శైలజ, విజయలక్ష్మి, శారద, దుర్గ భవాని, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply