విజయవాడ – హస్తమే అభయహస్తంగా “తెలంగాణ రైజింగ్” నినాదంతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతూ ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ శుభాకాంక్షలు అంటూ ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు అందరం ఒక్కటే అని ఆమె అన్నారు. రాష్ట్రంలో నియంత పాలనకు, బానిసత్వానికి స్వస్తి చెప్పి, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన అందిస్తూందని తెలిపారు. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఇతర కేబినెట్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
Greetings | హస్తమే అభయహస్తంగా “తెలంగాణ రైజింగ్” – వైఎస్ షర్మిల
