ముంబై : బంగారం ధరలు భారీగా పడిపోయాయి. రెండ్రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన పసిడి ధరలు శాంతించాయి. నేడు తులం గోల్డ్ ధరపై రూ. 1800 తగ్గింది. తగ్గని ధరలు కొనుగోలుదారులకు ఊరటకలిగిస్తున్నాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో వెండిపై రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 688, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,880 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1650 తగ్గడంతో రూ. 88,800 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1800 తగ్గడంతో రూ. 96,880 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,950గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,030 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. నేడు కిలో వెండిపై రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,09,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1100 తగ్గడంతో రూ. 97,900 వద్ద అమ్ముడవుతోంది.