- ఉంగరం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి
- సర్పంచ్ అభ్యర్థి సాటు అరుణ రాజు యాదవ్
షాద్నగర్, ఆంధ్రప్రభ : రామేశ్వరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని… సర్పంచ్ అభ్యర్థి సాటు అరుణ రాజు యాదవ్ తెలిపారు. రామేశ్వరం గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, త్రాగునీటి సమస్య వంటి మౌలిక వసతులన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. “మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి. ఉంగరం గుర్తుకు మీ ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి” అని ఓటర్లను ఆయన కోరారు.

