Gift | కేసీఆర్‌ పుట్టినరోజు – పుడమి పులకరించేలా వృక్షార్చన

హైదరాబాద్ : రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ ఇప్పటికే అద్భుత ఫలితాలతో అప్రతిహతంగా కొనసాగుతున్నది. 2018 జూలై 27న ‘హరా హైతో భరా హై’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ హరిత యజ్ఞంలో దేశవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలు, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటాలని ప్రజలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. నేడు తెలంగాణ తొలి సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో ‘వృక్షార్చన’కు శ్రీకారం చుట్టింది.

ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి సెల్ఫీ దిగి 9000365000 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని సంస్థ కోరింది. ఇందులో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గాలు, పట్టణాల్లో వృక్షార్చనపై క్షేత్ర స్థాయిలో మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌ అవగాహన కల్పించారు. పోస్టర్లు ఆవిష్కరించి వృక్షార్చనపై విస్తృత ప్రచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *