హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : క్రీడా విద్యలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ రిటైర్డ్ భారత క్రికెటర్, మాజీ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్కు వోక్సెన్ విశ్వవిద్యాలయం ఆతిథ్యం ఇచ్చింది. ఇటీవల క్యాంపస్కు వచ్చిన ప్రసాద్, వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీ మౌలిక సదుపాయాలను అన్వేషించారు.
వోక్సెన్ విశ్వవిద్యాలయంతో ఎంఎస్కే ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ, సిక్స్ఎస్ స్పోర్ట్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈసందర్భంగా ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ… భవిష్యత్ క్రికెట్ స్టార్లను రూపొందించడంలో నిర్మాణాత్మక శిక్షణ పాత్రను వెల్లడించారు. ఐపీఎల్ పదేళ్లకు రూ.7,000 కోట్ల విలువైన టీవీ హక్కులతో ప్రారంభమై ఇప్పుడు కేవలం ఐదు సంవత్సరాలకు రూ.50,000 కోట్లకు విస్తరించిందన్నారు. ఇది బీసీసీఐ, ఐపీఎల్ కౌన్సిల్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. గవాస్కర్ రవిశాస్త్రి వంటి ప్రతిభావంతులను గుర్తించడంలో విశ్వవిద్యాలయ క్రీడలు కీలక పాత్ర పోషించాయన్నారు.
గత తరాల నుండి నేటి క్రికెట్ దృశ్యం వరకు, విజి ట్రోఫీ వంటి విశ్వవిద్యాలయ స్థాయి లీగ్లు అద్భుతమైన ఆటగాళ్లను తయారు చేశాయన్నారు. వోక్సెన్ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రమాణాలతో కూడిన అద్భుతమైన క్రీడా సౌకర్యాన్ని తయారు చేయడం పట్ల సంతోషంగా వుందన్నారు. ప్రతిభను సరైన మార్గంలో పెంపొందించడానికి మనం దానిని ఉపయోగించుకోవాలన్నారు.