Palnadu | ఘోర రోడ్డుప్ర‌మాదం.. ఐదుగురు మృతి

వినుకొండ: పల్నాడు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర‌ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయి కాయల లోడ్ తో వెళ్తున్న ఓ వాహ‌నం ట్రాలీని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలిలో ముగ్గురు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *