Fake News – యుద్ధ విమానాలు కూల్చి వేసామంటూ పాక్ ఫేక్ ప్రచారం

న్యూ ఢిల్లీ | పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి భారత్‌ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది.

ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత భారత సైన్యానికి చెందిన రెండు స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్‌ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది.

భార‌తీయ వైమానికి ద‌ళానికి చెందిన అయిదు యుద్ధ విమానాల‌ను కూల్చివేసిన‌ట్లు పాకిస్థాన్ ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి పాక్ మీడియా క‌థ‌నాలు రాసింది. ఇండియా ఆరు ప్ర‌దేశాల్లో అటాక్ చేసిన‌ట్లు పాక్ మీడియా చెబుతోంది.

భార‌త్ త‌న వైమానిక క్షేత్రం నుంచి ఆ అటాక్ చేసిన‌ట్లు పాక్ వెల‌ల్డించింది. తెల్ల‌వారుజామున 2.45 నిమిషాల స‌మ‌యంలో రెండు ఇండియ‌న్ జెట్స్‌ను కూల్చివేసిన‌ట్లు పాక్ మంత్రి అతాహుల్లా త‌రార్ ద్రువీక‌రించారు. ఇక మూడ‌వ విమానం తెల్ల‌వారుజామున 3.42 నిమిషాల‌కు కూల్చివేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అవంతిపురాకు 17 నాటిక‌ల్ మైళ్ల దూరంలో భార‌తీయ ర‌ఫేల్ యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ వైమానిక ద‌ళం కూల్చివేసిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు మృతిచెందిన‌ట్లు పాకిస్థాన్ ఆర్మీ ప్ర‌క‌టించింది.

దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ చేసి పాక్‌ నీచ బుద్ధిని బయటపెట్టింది. ”పాక్‌ సైన్యం సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీదే. ఆ వీడియోలన్నీ పాతవి. భారత్‌కు చెందినవి కూడా కాదు. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో 2024లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను, ఐర్లాండ్‌లో జరిగిన మరో దాడులకు సంబంధించిన దృశ్యాలను వారు షేర్‌ చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండండి” అని కేంద్రం భారత పౌరులకు సూచించింది.

ఆపరేషన్‌ సిందూర్‌’ లో పాల్గొన్న యుద్ధ విమానాలు , ఆర్మీ సిబ్బంది సురక్షితంగా భారత్ కు చేరుకున్నారని పేర్కొంది.. ఈ దాడిలో తమ వైపు నుంచి ఎటువంటి నష్టం జరగలేదని తెలిపింది.

Leave a Reply