హైదరాబాద్: ఆరుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకువస్తే మంత్రి పదవి ఇస్తారా అని కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ముందు ఆఫర్ పెట్టినట్లు… కొత్త వార్త రాసింది ఓ దినపత్రిక .. ఈ వార్తా కథనంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దిన పత్రికలో ఫేక్ వార్తలే ప్రచురిస్తారా అంటూ నిలదీశారు.తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా ఆ పత్రికలో బుధవారం కూడా కవితపై ఓ వార్త వచ్చింది. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని ఆ వార్తల్లోని సారాంశం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెను చేర్చుకోవడం లేదని.. దీంతో కొత్త పార్టీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాలను నిన్న ఖండించారు కవిత.
తాజాగా నేడు కూడా ఆరుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకువస్తే మంత్రి పదవి ఇస్తారా అని కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ముందు ఆఫర్ పెట్టినట్లు… కొత్త వార్త రాసింది . అయితే దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత. ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ సింపుల్ గా కొట్టి పారేశారు.