Electric Shock | వృద్దురాలితో పాటు నాలుగు పశువుల మృతి

వాజేడు, జూ న్ 25 (ఆంధ్రప్రభ) : విద్యుత్ ఘాతానికి (electric shock) గురై ములుగు జిల్లా (Mulugu District) వాజేడు మండల పరిధిలోని చెరుకూరు గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు, నాలుగు పశువులు మృతిచెందిన సంఘటన మోత్కులగూడెం (Mothkula Gudem) గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… బండి రాజమ్మ (65) తమ సొంత పొలంలో ఉన్నటువంటి చింత చెట్టును నరుకుతున్న సందర్భంలో చింతచెట్టు కొమ్మ ఇరిగి త్రీఫేస్ లైన్ విద్యుత్ తీగల (Electrical wires) పై పడిపోవడంతో పక్కనే ఉన్న రాజమ్మతో పాటు, నాలుగు పశువులు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ సంఘటనను తెలుసుకున్న గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ ను నిలిపివేశారు. పాయం పాపారావుకు చెందిన ఒకటి, వాసం శ్రీనివాస్ కు చెందిన ఒకటి, పీర్ల రామస్వామికి చెందిన ఒక పశువులు మృతి చెందినట్లు గుర్తించారు.

Leave a Reply