Elections | గ్రామీణ ఓటర్లు ఆదర్శం..

Elections | గ్రామీణ ఓటర్లు ఆదర్శం..

Elections, నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాలని.. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య విలువలకు అండగా నిలవాలని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్ పర్సన్ వి. శోభారాణి, నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల్లో ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలకు చట్ట పరిధిలో, అంకితభావంతో గ్రామ అభివృద్ధికి, వ్యక్తిగత సంక్షేమ పథకాలు అందించడానికి అంకిత భావం కలిగిన అభ్యర్థికి ఓట్లు వేసి ఎన్నుకోవాలని వారు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 85% పైగా ఓటు హక్కు వినియోగించుకొని తమ అభిప్రాయాన్ని ఓటుతో తెలియచేయడంలో ముందున్నారని గ్రామీణ ఓటర్లు అభినందనీయులని అన్నారు. పట్టణ ఓటర్లు 50% లోపే వినియోగించుకోవడం ఇప్పటి వరకు జరుగుతుందని గ్రామీణ ఓటర్లను ఆదర్శంగా తీసుకొని పట్టణ ఓటర్లు 85% పైగా వినియోగించుకోవడానికి ముందుకు రావాలని కోరారు.

Leave a Reply