AP | చ‌దువే భ‌విష్య‌త్తు.. పెట్టుబ‌డి : హోంమంత్రి అనిత‌

విజయనగరం, ఆంధ్ర‌ప్ర‌భ : పిల్ల‌ల‌కు చ‌దువే భ‌విష్య‌త్తు అని, అలాగే పెట్టుబ‌డి కూడా అని రాష్ట్ర హోంశాఖ మంత్రి, విజ‌య‌న‌గ‌రం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Anita Vangalapudi) అన్నారు. సోమ‌వారం విజ‌య‌న‌గ‌రం వై జంక్ష‌న్ వ‌ద్ద ఉన్న ఓ క‌న్వెష‌న్‌లో జ‌రిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్ర‌దానం కార్య‌క్ర‌మానికి ఆమె హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో టెన్త్, ఇంట‌ర్ (Tenth, Inter) ప‌రీక్ష‌ల్లో అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు ఈ అవార్డులు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్య‌ను అభ్య‌సించిన విద్యార్థుల‌కు అవార్డులు అంద‌జేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. విద్యార్థుల‌కు విద్య విలువ నేర్ప‌తుంద‌ని చెప్పారు.

త‌ల్లిదండ్రుల త్యాగాలు మ‌రువ‌రాదు..
పిల్ల‌ల కోసం త‌ల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు (Sacrifices) చేస్తార‌ని, త‌ల్లిదండ్రులు త్యాగాల‌ను పిల్ల‌లు మ‌రువ‌రాద‌ని మంత్రి అనిత అన్నారు. పిల్లల విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుంద‌ని చెప్పారు. ప్రతి విద్యార్థి లక్ష్యం దిశగా ముందుకు వెళ్లాల‌న్నారు. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ చ‌దువుకోవాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *