చిట్యాల, ఏప్రిల్ 29 (ఆంధ్ర ప్రభ) : రైతులు పండించిన వరి పంట మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దుని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. మంగళవారం మండలంలోని నైన్ పాక, జడల్ పేట, ఒడితల,ధూత్ పల్లి గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ, ఓడిసియంఎస్, మ్యాక్స్ సొసైటీ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే జిఎస్సార్ ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశ్రీ, చిట్యాల మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ నేతలు, గుట్ల తిరుపతి, ముక్కిరాల మధు వంశీకృష్ణ, కామిడీ రత్నాకర్ రెడ్డి, అల్లకొండ కుమార్, పీఏసీఎస్ సీఓ మెరుగు మొగిలి, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులున్నారు.