అమెరికా : పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత జమ్ముకశ్మీర్కు అమెరికన్లు వెళ్లొద్దని ఆ దేశ ప్రభుత్వం సూచించింది. మళ్లీ ఉగ్రదాడులు జరగడంతోపాటు పౌర అశాంతి నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది.
అందుకే జమ్ముకశ్మీర్కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పరోక్షంగా తెలిపింది. సాయుధ ఘర్షణకు అవకాశం ఉన్నందున భారతదేశం-పాకిస్థాన్ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండాలని తమ పౌరులను కోరింది. ఈ మేరకు బుధవారం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.