MDK | సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకం … దామోదర్ రాజనర్సింహ

మెద‌క్ : భారతదేశంలో మొట్టమొదటిసారిగా రేషన్ కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో సాయి కృష్ణ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్నబియ్యాన్ని స్థానిక శాసన సభ్యురాలు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… మెదక్ జిల్లాలో 525 రేషన్ షాపుల ద్వారా 2,13,828 రేషన్ కార్డు దారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4430. 496 మెట్రిక్ టన్నుల సన్నబియ్యంను రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. దీని ద్వారా 6 లక్షల 96 వేల 43 మంది సభ్యులకు సన్నబియ్యం పంపిణీ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఆహార భద్రత కార్డులోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి 6 కిలోల చొప్పున సన్నబియ్యంను పంపిణీ చేస్తున్నమన్నారు. అలాగే, అంత్యోదయ కార్డు ఒక్కటికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు ఒక్కంటికి 10 కిలోలు చొప్పున ఉచితంగా సన్నబియ్యం ను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్భంగా వెల్లడించారు.

అలాగే, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని 645 మంది లబ్ధిదారులకు 6 కోట్ల 45 లక్షల 74 వేల 820 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆకుల రాజు రెడ్డి రాజిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *