Devotional | తిరుమ‌ల‌లో వేస‌వి ర‌ద్దీ – గ‌త నాలుగు రోజులుగా శ్రీవారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం

రోజు రోజుకి పెరుగుతున్న భ‌క్తుల ర‌ద్దీ
అన్ని కంపార్ట్ మెంట్ల‌ల‌లోనూ కిట‌కిట‌
ఏటీసీ, టీబీసీ, ఏటీజీహెచ్, కృష్ణతేజ అతిథిగృహం,
రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వ‌ర‌కు భ‌క్తుల క్యూలైన్
మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన టిటిడి
సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగిస్తూ నియంత్ర‌ణ
ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు అక్క‌డే అన్న‌ప్ర‌సాదాలు
కంపార్ట‌మెంట్ ల‌లోనే 15 చోట్ల ఫుడ్ స్టాల్స్ …
చిన్నారుల‌కు, వృద్ధుల‌కు, పాలు, టీ అంద‌జేత

తిరుమ‌ల – తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గ‌త నాలుగు రోజులుగా దర్శనానికి 24 గంటల సమయ పడుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటం తో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ కి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. దర్శనం లో సాంకేతికత వినియోగించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. అలిపిరి వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు పై కసరత్తు జరుగుతోంది.

ఇదే సమయంలో క్యూ లైన్ల నిర్వహణలో మార్పులు తెచ్చింది. తాజాగా టికెట్ కౌంటర్ల నిర్వహణలోనూ నిర్ణయాలు తీసుకుంది. కొనసాగుతున్న రద్దీ తిరుమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వారాంతంలో 90 వేలకు పైగా, మిగిలిన రోజుల్లో 70,000 నుంచి 80,000 మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది.

గతంలో సరైన లెక్కింపు లేకుండానే కంపార్ట్‌మెంట్‌కు ఇంతమంది అని ఉజ్జాయింపుగా లెక్కించేవారు. ఇప్పుడు టీటీడీ తిరుమలలో భక్తుల క్యూ లైన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌పై దృష్టి సారించింది. దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరినీ లెక్కేసి, క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకొని భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుం టున్నారు. క్యూలైన్‌లో భక్తులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఖాళీ ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కీలక చర్యలు అందులో భాగంగా రద్దీ ప్రాంతం నుంచి ఖాళీ ఉన్నచోటుకు భక్తులను పంపి తోపులాట చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

కంపార్ట్‌మెంట్లలోకి నిర్ణీత సంఖ్యలో మాత్రమే భక్తుల ను అనుమతిస్తున్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండి ఏటీసీ, టీబీసీ, ఏటీజీహెచ్, కృష్ణతేజ అతిథిగృహం, రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు వేచి ఉండే భక్తులకు ఎప్పటి కప్పుడు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఇందుకోసం క్యూలైన్‌కు ఆనుకొని 15 చోట్ల కొత్తగా ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు అన్నప్రసాదాలు పంపుతూ ఎప్పుడు, ఎంత సరఫరా చేశారో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *