Development | పీసీసీ ని కలిసిన రహత్ నగర్ సర్పంచ్

Development | పీసీసీ ని కలిసిన రహత్ నగర్ సర్పంచ్
Development | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వంత గ్రామం భీంగల్ మండలం రహత్ నగర్, రహత్ నగర్ గ్రామ సర్పంచ్ గా యువకుడు తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ తిరుపతి ఈ రోజు హైదరాబాద్(Hyderabad)లో పీసీసీని కలిశారు.
ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షుడు తన స్వంత గ్రామం సర్పంచ్ గా తిరుపతి ఏకగ్రీవంగా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తిరుపతిని శాలువాతో సత్కరించారు. రహత్ నగర్ గ్రామం అభివృద్ధి(Development) కొరకు సహకరించాలనీ, ఈ సందర్బంగా తిరుపతి పీసీసీని కోరారు. పీసీసీని తిరుపతితో పాటు మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం నాయకులు గోపాల్ నాయక్, సంగ్యా నాయక్, బాలు నాయక్, పర్శ అనంత్ రావు ఉన్నారు.
