న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : న్యూఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ చైతన్య జ్వాల, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంత్యుత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో…
తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కురుమ, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.