విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేధికగా మరికొద్దిసేపట్లోె ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ను ఎంచుకుంది.. ఇక ఢిల్లీ జట్టుకు విశాఖ రెండో హోమ్ గ్రౌండ్గా ఉంది. ఇక్కడ క్యాపిటల్స్ రెండు మ్యాచ్లు ఆడనుంది. : ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ జట్లు కొత్త కెప్టెన్ నాయకత్వంలో ఐపీఎల్ 2025లో తమ ప్రచారాన్ని ప్రారంభించనున్నాయి. ఈసారి ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ నాయకత్వం వహిస్తుండగా, రిషబ్ పంత్ లక్నో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నారు. పంత్ తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్ కాకుండా వేరే జట్టు తరపున ఆడనున్నాడు. గత సీజన్లో అతను ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ, ఇప్పుడు అతను లక్నో జట్టుకు నాయకత్వం వహించే సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది.
ప్రత్యేక ఆకర్షణగా రిషబ్ పంత్, అక్షర్ పటేల్
నేడు జగనున్న ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైయింట్స్ జట్టు-కు సారధ్యం వహి స్తున్న రిషబ్ పంత్, ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అక్షర్ పటేల్ క్రీడా భిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టులో అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్, కుల్దిప్ యాదవ్, మిచెల్ స్టార్స్, ఫాఫ్ డుప్లెసిస్, టిస్టన్ స్టబ్స్, నటరాజన్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఈ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు లక్నో జెయింట్స్లో కెప్టెన్ రిషబ్ పంత్తో పాటు మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, అబ్దుల్ సమద్ వంటి స్టార్ క్రికెటర్లతో ఈ జట్టు కూడా స్ట్రాంగ్ కనిపిస్తోంది. ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.
బలంగా కనిపిస్తోన్న ఢిల్లీ జట్టు..
విదేశీ, భారత ఆటగాళ్ల మంచి కలయికతో ఢిల్లీ జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది. బ్యాటింగ్లో ఫాఫ్ డు ప్లెసిస్ అనుభవం ఢిల్లీకి ప్రయోజనం చేకూరుస్తుండగా, బౌలింగ్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అనుభవం ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్తో ఢిల్లీ జట్టు బలమైన మిడిల్ ఆర్డర్ను కలిగి ఉంది. ఇందులో రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ కూడా ఉన్నారు. ఢిల్లీ బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ స్పిన్ విభాగం అక్షర్, కుల్దీప్ యాదవ్లలో ఇద్దరు అనుభవజ్ఞులైన భారత స్పిన్నర్లు ఉన్నారు. స్టార్క్ తో పాటు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో టి నటరాజన్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర ఉన్నారు.
తగ్గేదేలే అంటోన్న లక్నో..
లక్నో తమ భారత ఆటగాళ్ళు విదేశీ ఆటగాళ్లతో బాగా కలిసిపోతారని ఆశిస్తుంది. విదేశీ ఆటగాళ్ళలో, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా బౌలింగ్ చేయకూడదని నిర్ణయించడంతో.. అతను స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో, లక్నో దక్షిణాఫ్రికా జంట డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్ నుంచి మంచి ప్రదర్శనను ఆశిస్తుంది. నికోలస్ పూరన్ రూపంలో, లక్నోలో ఒక తుఫాన్ బ్యాట్స్మన్ ఉన్నాడు, అతను ఒంటరిగా మ్యాచ్ను తిప్పికొట్టగలడు. అతనితో పాటు, లక్నో జట్టులో ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ రూపంలో మంచి భారత బ్యాట్స్మెన్ ఉన్నారు. అయితే, భారత ఫాస్ట్ బౌలర్లు మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, ఆకాశ్దీప్ ఇంకా గాయాల నుంచి కోలుకోవడంతో బౌలింగ్ విభాగం నుంచి లక్నో ఆందోళన పడుతోంది. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకోవడం ద్వారా లక్నో బలం పెరిగింది. గాయపడిన ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ స్థానంలో శార్దూల్ను జట్టులోకి తీసుకున్నారు.
ఢిల్లీ జట్టు : జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఫాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్.
లక్నో జట్టు : ఎడెన్ మర్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుస్ బదొని, రిషభ్ పంత్(వికెట్ కీపర్, కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రథీ, షాబాజ్ అహ్మద్, శార్థూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్