Delhi | సోనియా, రాహుల్‌గాంధీకి ఊరట

Delhi | ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీకి కీలక ఊరట లభించింది. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు సంబంధించిన ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో వారిద్దరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా.. రాహుల్‌, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్‌ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు ఈడీ చెబుతోంది.

Leave a Reply