ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడిన ఆర్సీబీ… ఆఖరి వరకు పోరాడి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, ఆర్సీబీకి వరుసగా 6/6 అవే గేమ్ విక్టరీలు కావడం విషేషం. ఈ విజయంతో 14 పాయింట్లు సాధించిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానకి 162 పరుగులు నమోదు చేసింది. ఇక 163 పరుగుల స్వల్ప టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన ఆర్సీబీ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది.
డెబ్యూట్ ప్లేయర్ జాకబ్ బెథెల్ (12) 2.2వ ఓవర్లో ఔటయ్యాడు. 2.4వ ఓవర్లో పాడిక్కల్ (0), 4.0 వద్ద కెప్టెన్ రజత్ పటీదర్ (6) రూపంలో ఆర్సీబీ వరుస వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా, ఓపెనర్ విరాట్ కోహ్లీతో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు.
ఓవైపు కోహ్లీ నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతుండగా.. మరోఎండ్ లో కృనాల్ పాండ్యా సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్), కోహ్లీ (47 బంతుల్లో 51) చెరో అర్ధశతకం సాధించారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్ కు 84 బంతుల్లో 119 పరుగులు జోడించారు.
అయితే, 4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 17.5 ఓవర్ల పాటు వికెట్ కోల్పోకుండా ఆడింది. ఇక చివరిగా వచ్చిన టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్) 18వ ఓవర్లో వరుస బౌండరీలు బాది.. మరో 9 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ను ఆర్సీబీ ఖాతాలో వేసాడు.

ఢిల్లీ బౌలర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టాడు.
పర్పుల్, ఆరెంజ్ క్యాప్ ఆర్సీబీ సొంతం !
ఈరోజు జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై రెండు వికెట్లు తీసిన ఆర్సిబి బౌలర్ జోష్ హేజిల్వుడ్, ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓవరాల్ గా 18 వికెట్లు పడగొట్టాడు. దీంతో పర్పుల్ క్యాప్ను గెలుచుకున్నాడు.
అదేవిధంగా ఈ మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 442 పరుగులతో ఆరెంజ్ క్యాప్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.