- CLT20 ఆధారంగా ‘ప్రపంచ క్లబ్ టోర్నీ’
- ఐపీఎల్ జట్ల సహకారం కీలకం
అంతర్జాతీయ క్లబ్ టోర్నమెంట్ను ప్రవేశపెట్టాలని ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) పరిశీలిస్తోంది. 2009 – 2014 వరకు జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) ఆధారంగా… ఈసీబీ ఇప్పుడు వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ పేరుతో కొత్త టోర్నీకి ప్లాన్ చేస్తోంది.
ఈ విషయం మీద ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గోల్డ్ మాట్లాడుతూ, “ఇది ఆట అభివృద్ధిలో తదుపరి పెద్ద అడుగు అవుతుంది. పరుషులు, మహిళల కోసం ఇలాంటి టోర్నీ రావాల్సిన సమయం వచ్చింది,” అని స్పష్టం చేశారు.
2009లో ప్రారంభమైన CLT20.. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ల సహకారంతో జరిగింది. అయితే 2014 తర్వాత ప్రేక్షకాదరణ, వాణిజ్య పరంగా నష్టాల్లో ఉండటంతో ఈ లీగ్ ను నిలిపేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఐపీఎల్ తో పాటు, SA20, ILT20, MLC లాంటి లీగ్లు బలంగా నిలిచాయి.
ఐపీఎల్ లోని 10 జట్లలో 8 జట్లకు ఇతర దేశాలలో ఫ్రాంచైజీలు ఉన్నాయి. దీంతో, ఈ గ్లోబల్ క్లబ్ టోర్నమెంట్ జరిగే అవకాశం ఉందని ఈసీబీ భావిస్తోంది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ కూడా ఇటీవల దీనిపై ఆసక్తి చూపారు.
ఈ టోర్నీ ద్వారా ఫ్రాంచైజీ క్రికెట్కు మరింత విలువ చేకూరుతుందనే ఆశతో ఈసీబీ ముందుకెళ్తోంది. కానీ ప్రణాళికలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.
ఈ టోర్నమెంట్ ఫ్రాంచైజ్ క్రికెట్కు మరింత విలువను జోడిస్తుందనే ఆశతో ఈసీబీ ముందుకు సాగుతోంది, అయితే ప్రణాళికలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గోల్డ్ తెలిపారు.
కాగా, ఈ క్లబ్ టోర్నీ వస్తే, క్రికెట్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడంలో సందేహమే లేదు.