Condolence | సింహాచ‌లం ఘ‌ట‌నపై కెటిఆర్ విచారం

హైద‌రాబాద్ – సింహాచలం ఆలయం వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద వార్త తనను తీవ్రంగా బాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.

ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు అత్యంత బాధాకరమని, బాధితులందరికీ తన ప్రగాఢ సానుభూతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అది కూలిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *