Condolence : మాగంటి మృతికి కెసిఆర్, కేటిఆర్, హరీశ్ ల సంతాపం

హైదరాబాద్‌: పార్టీ సీనియర్‌ నేత, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి చింతిస్తూ సంతాపం తెలిపారు. గోపీనాథ్‌ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడిగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

కేటీఆర్ …

మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. గోపీనాథ్‌ను కోల్పోవడం బీఆర్‌ఎస్‌కు తీరని లోటని చెప్పారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. మాగంటి గోపినాథ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

హరీశ్ రావు…

మాగంటి అకాల మరణం అత్యంత బాధాకరమని చెప్పారు ఎమ్మెల్యే హరీశ్‌ రావు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శమని తెలిపారు. గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *