Compansession| ఒక్కో ప్రయాణీకుడికి రూ. కోటి నష్ట పరిహారం

ముంబాయి – విమాన ప్రమాదంపై ఎయిర్‌ ఇండియా (Air India) ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ (Campbell Willson) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.కోటి (వన్ crore ) పరిహారం ప్రకటించింది.

విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఈ క్షణంలో బాధ వర్ణనాతీతమని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు. వారికి అవసరమైన సహకారం అందించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, ఈ విమానం కుప్పకూలడంతో ధ్వంసమైన బిజే మెడికల్‌ హాస్టల్‌ నిర్మాణానికి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *