Chintana | ఆత్మలో స్థిరత్వం!

అజామిళునికి అంత్యకాలం సమీపించింది. యమభటులు వచ్చి అతని కంఠానికి పాశాలు బిగించారు. అజామిళుడు భయంతో తన కుమారుడిని ‘నారాయణా! నారాయణా’ అని పిలిచాడు. విష్ణు దూతలొచ్చి యమపాశాలను తొలగించి అజామిళుని తమ వెంట తీసుకువెళ్ళారు. యమ దూతలు నిరుత్సా#హం చెంది యమధర్మరాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్నంతా చెప్పి అలా ఎందుకు జరిగిందని అడిగారు.


యమ ధర్మరాజు వారితో, ”దూతలారా! మీరు నన్నే శ్రేష్ఠుడని తలచుచున్నారు. అది వాస్తవము కాదు. నా కన్ననూ, ఇంద్రుడు మొదలైన దేవతలకన్ననూ శ్రేష్ఠుడైన పరమేశ్వరుడొకడున్నాడు. ఈ జగత్తంతయూ ఆయన అధీనములో నుండును. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు ఆయన అంశలు మాత్రమే. ఆయన అభీష్టానికి అను
గుణంగా సృష్టి, స్థితి, లయములు జరుగు చుండును. ఆయన వాక్కులే వేదాలు” అని అన్నాడు. (పుట 360 -షష్ఠ స్కంధము, భాగవత సుధ, శ్రీ రామకృష్ణ తపోవనం, చెన్నై)


ఇక్కడ కొంత ఆగి ఆలోచిద్దాం. వేదాలంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనునాలుగు గ్రంథాలని, ముందర ఒక అట్ట ముక్క, వెనుక ఒక అట్టముక్క వేసి బైండ్‌ చేయబడిన ఆ నాలుగు గ్రంథాల్లోనే భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు కావలసిన జ్ఞానాన్నంతా పరమేశ్వరుడు ఏనాడో కుదించి పెట్టేశాడని మనలో చాలా మంది అభిప్రాయము. పరమేశ్వరుని వాక్కులే వేదాలు అని భాగవతం అంటున్నది. అంటే చెప్పాల్సిన దాన్నంతా ఆ నాలుగు వేదాల్లో కుదించేట్టు ఆనాడు చెప్పేసి, అప్పటినుంచి మూగవాడై ఇంకేమి చెప్పలేని స్థితిలో పరమేశ్వరుడున్నాడని అనుకోవాల్నా? అది అర్ధం పర్ధం లేని చింతన అవుతుంది. ఆనాటి వరకు అన్ని లౌకిక విషయాలను ప్రక్కనపెట్టి, అతి శ్రద్ధతో, ఏకాగ్రతతో వినగల్గిన వారికి పరమేశ్వరుడు బోధించాడు. ఆ బోధనలను క్రోడీకరించి విభజించి ఆ నాల్గు వేదాలుగా లోకానికి అందించాడు వ్యాస భగవానుడు. అంతే, ఆ తర్వాత పరమేశ్వరుడు మూగవాడైనాడని గానీ, లోకానికి బోధించాల్సింది


ఆయన వద్ద ఇంక ఏమి మిగిలి ఉండలేదని గానీ అనుకోరాదు. ఈనాడైనా ఎవరైనా ‘నేను’, ‘నాది’ అను వాటిని ప్రక్కన పెట్ట గలిగి నోరు విప్పితే, పిల్లన గ్రోవి నుంచి శ్రీకృష్ణ భగవానుని గానం వెలువడినట్టు, అద్భుతమైన పరమేశ్వరుని బోధ ప్రవహించి తీరుతుంది. అదంతా వేదమే. ”వేదాలంటే గ్రంథాలు కావు. వివిధ కాలాల్లో, విభిన్న సాధకులు కనుగొన్న ఆధ్యాత్మిక సత్యాల నిధులే వేదాలు”, అని వివేకానంద స్వామి చెబుతారు (ప్రుట 34 లేవండి, మేల్కోనండి -01రామకృష్ణమఠం) పరమేశ్వరుడు ఆద్యంతాలు లేనివాడు, ఆయన బోధ ఆద్యంతాలు లేనిదే, వేదాలూ ఆద్యంతాలు లేనివే.

అందుకే వేదాన్ని ‘అనాది’ అన్నారు. అంటే ఆది లేనిది అని అర్థం-ఆది లేని దానికి అంతం మాత్రం ఎలా ఉండగలదు? నిరాటంకంగా, నిరంతరం పరమ#హంసల ద్వారా ప్రవ#హంచే ”పరమేశ్వరుని గానామృతమే బోధామృతం” భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో చెవులారా విని ఆనంద పరవశులమవుదాం. ఆ బోధను ఆచరించి వైకుంఠాన్ని పొందుదాం… వైకుంఠం అంటే ‘కుంఠితము’ కానిది అని పెద్దలు చెబుతారు. అంటే ఆత్మలో స్థిరంగా నిలబడడం.

– రాచమడుగు శ్రీనివాసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *