Chattisgarh | ఆ 12 మందిని వ‌దిలివేసిన మావోయిస్ట్ లు

పద‌కోర్మ గ్రామంలో న‌క్సలైట్లు ఘాతుకం
ఇన్ ఫార్మ‌ర్ల నేపంతో ముగ్గురికి ఉరి
12 మంది గ్రామ‌స్థులు అప‌హ‌ర‌ణ
పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన భ‌ద్ర‌తా ద‌ళాలు
నేటి ఉద‌యం అంద‌రిని విడిచి పెట్టిన మావోయిస్ట్ లు

చత్తీస్ గ‌ర్ | పెదకోర్మ గ్రామానికి చెందిన ముగ్గురిని ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చారు..ఇదే సందర్భంగా 12 మందిని అపహరించిన మావోయిస్టులు అప‌హ‌రించారు. కాగా లొంగిపోయిన మావోయిస్టు దినేశ్‌ మడివి బంధువులైన ముగ్గురిని మంగళవారం సాయంత్రం పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో వారిని బహిరంగ విచారణ జరిపి వేసి చంపేశారు. మృతులు జింగు మోడియం, సోమ మోడియం, అనిల్ మండావిగా గుర్తించారు. ఇక‌ మ‌రో 12 మంది గ్రామ‌స్థుల‌ను అప‌హ‌రించారు..

దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.. ఈ నేప‌థ్యంలోనే మావోయిస్టులు అపహరించుకు వెళ్లిన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన పెదకోర్మ గ్రామస్తులని బుధవారం ఉదయం విడుదల చేశారు. వారంతా క్షేమంగా త‌మ గ్రామానికి చేరిన‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు…

Leave a Reply