Champions Trophy | లాథ‌మ్ శ‌త‌కం – కివీస్ భారీ స్కోర్

క‌రాచీ – ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట‌ర్ లాథ‌మ్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో శ‌త‌కం సాధించాడు. ప్ర‌స్తుతం 46 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 276 ప‌రుగులు చేసింది. కివీస్. నేటి నుంచి పాకిస్తాన్ లో ఆరంభ‌మైన ఈ టోర్నిలో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. క‌రాచీ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో కివీస్ బ్యాట‌ర్స్ యంగ్,లాథ‌మ్ లు శ‌త‌కాలు సాధించారు..

ఇక మ్యాచ్ లో 10 పరుగులు చేసిన డేవిన్ కాన్వే పాక్ స్పీడ్ స్టర్ అర్బర్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఇక రెండో వికెట్ గా ఒక పరుగు చేసిన కేన్ విలియమ్స్ వెనుతిరిగాడు.. ఈ వికెట్ నసీమ్ షా కు దక్కింది. మూడో వికెట్ ను మిచెల్ రూపంలో కోల్పోయింది. ఈ వికెట్ హ‌రీశ్ రాఫ్ ద‌క్కింది.. మిచెల్ కేవ‌లం ప‌ది ప‌రుగులు మాత్ర‌మే చేశాడు..అటు త‌ర్వాత యంగ్ కు తోడుగా బ‌రిలోకి వ‌చ్చిన లాంథ‌మ్ నిల‌క‌డ‌గా బ్యాటింగ్ చేశాడు.. ఈ ఇద్ద‌రు క‌ల‌సి నాలుగో వికెట్ కు 118 ప‌రుగులు జోడించారు.. యంగ్ 107 ప‌రుగులు చేసి న‌సీమ్ బౌలింగ్ లో నాలుగో వికెట్ గా పెవిలియ‌న్ కు చేరాడు. యంగ్ 113 బంతుల‌లో ఒక సిక్స్ , 12 ఫోర్ల‌తోఈ ప‌రుగులు సాధించాడు ఇక గ్లెన్ ఫిలిప్స్ తో క‌ల‌సి లాథ‌మ్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఈ ద‌శ‌లో లాథ‌మ్ శ‌త‌కం సాధించాడు. ఈ శ‌త‌కంలో తొమ్మిది ఫోర్లు , రెండు సిక్స్ ఉన్నాయి.. ప్ర‌స్తుతం లాథ‌మ్ 100, ఫిలిప్స్ 47 ప‌రుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *