ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వచ్చే నెల (ఏప్రిల్) 3న జరగనుంది. ప్రతీ నెల రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయంతో.. మూడవ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులకు ఆమోదం లభించనుంది.
రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించాల్సిన అంశాలను ఈ నెల 27వ తేదీలోపు పంపాలని అన్ని శాఖలకు ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.