- ఓ ఇంటి ముందు ముగ్గులు, నిమ్మకాయలు
- ఆందోళనలో కుటుంబ సభ్యులు
కాసిపేట (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా), ఆంధ్రప్రభ : ఏజెన్సీ (agency) లో చేతబడులను ప్రజలు ఎక్కువగా నమ్ముతుంటారు. చేతబడి చేశారన్న నెపంతో ఎన్నో హత్యలు కూడా జరిగిన సంఘటనలున్నాయి. కాసిపేట (Kasipeta) లో ఓ ఇంటి ముందు ముగ్గులు, నిమ్మకాయలు ఉండడంతో ఎవరో చేతబడి చేశారని ఆ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో కలకలం సృష్టించింది. గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో గ్రామస్థులు కూడా ఒకింత భయాందోళనకు గురవుతున్నారు.
సంఘటన జరిగిందిలా…
కాసిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS School) సమీపంలో నివాసం ఉంటున్న సల్లూరి లక్ష్మి ఇంటి ముందు ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గులు వేసి, దానిపై నిమ్మకాయ పెట్టి, పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ఆ పూజలను చేసిన కుంకుమ గోడలకు, తలుపులకు రాశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు భయాందోళన (Panic) కు గురయ్యారు. ఇంట్లో పరిస్థితి బాగోలేక మరో గ్రామం నుంచి కాసిపేట వచ్చామని, ఇక్కడ కూడా తమపై కక్షతో చేతబడి చేస్తున్నారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పూజలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ఈ మేరకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.