పాట్నా : పాట్నా (Patna) నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఓ పక్షి (Bird) ఢీకొంది. పాట్నా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి పాట్నా ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ (Emergency landing) చేశారు. ఈ విమానంలో మొత్తం 169మంది ప్రయాణీకులున్నారు. విమానం సేఫ్ గా ల్యాండింగ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణీకులను వేరే విమానంలో ఢిల్లీకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
Breaking | ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. పాట్నాలో క్రాష్ ల్యాండింగ్
