Bichkunda | భాగవత సప్తాహంలో పిట్లం మహిళలు
Bichkunda | బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా (Kamareddy District) జుక్కల్ నియోజకవర్గం కాశీ క్షేత్రంలో పిట్లం మహిళామండలి అధ్యక్షురాలు వి.ప్రమీల (V. Pramila) ఆధ్వర్యంలో మహిళలు భగవత్ సప్తాహం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ప్రమీల మాట్లాడుతూ… భగవంతుని నామస్మరణ చేస్తే అన్ని కష్టాలు దూరమవుతాయన్నారు. పిట్లం(Pitlam) తో పాటు పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన పలువురు మహిళలు ఈ సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.

