హైదరాబాద్, ఆంధ్రప్రభ : శస్త్రచికిత్స అనంతరం యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy)ని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ (Balka Suman) గురువారం పరామర్శించారు. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. రాజేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
HYD | పల్లాకు బాల్క సుమన్ పరామర్శ
