ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పరిధిలో ఉన్న దస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధి అనంతపూర్ గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందా. వివరాలు ఇలా ఉన్నాయి… ఇచ్చోడ మండలలోని గుండాల గ్రామపంచాయతీకి చెందిన షేక్ సుహన్ (14) తన మామ వాళ్ళ ఇంట్లో గత నాలుగు సంవత్సరాల నుండి చదువుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు.
సెలవుల సందర్భంగా ఇవాళ తన మామతో కలిసి సిరికొండ మండలంలో ఉన్న పోచంపల్లికి ఆటోలో కిరాణం సామాన్లు అమ్మడానికి తీసుకొని వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు అనంతపూర్ మూలమలుపు వద్ద ఆటో బోల్తా పడి యువకుడు మృతి చెందాదు. తల్లిదండ్రులు ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.